తెలంగాణ

telangana

By

Published : Nov 19, 2020, 3:04 PM IST

ETV Bharat / state

ఇందిరకు ఉత్తమ్​, భట్టి విక్రమార్క నివాళి

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పీసీసీ చీఫ్​ ఉత్తమ్​, సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, కాంగ్రెస్ గ్రేటర్​​ అధ్యక్షుడు అంజన్​కుమార్​ యాదవ్​.. నివాళులు అర్పించారు. దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

indira jayanthi
ఇందిరాగాంధీకి నివాళులర్పించిన ఉత్తమ్​, భట్టి

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌ గ్రేటర్‌ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి.. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.

గాంధీ భవన్‌లోని సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి.. ఇందిర చిత్రపటానికి పూల మాలలువేసి నివాళులు అర్పించారు. ఆమె చేసిన సేవలు, తీసుకొచ్చిన సంస్కరణలను గుర్తు చేసుకున్నారు.

ఇవీచూడండి:నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడిన గాంధీభవన్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details