తెలంగాణ

telangana

By

Published : Sep 17, 2019, 5:40 PM IST

ETV Bharat / state

రోగులకు పండ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రులు

ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు, భాజపా ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్​ జోషి, కిషన్​ రెడ్డి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

రోగులకు పండ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రులు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు, కేంద్రంలో భాజపా ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర కార్మికశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సనత్‌ నగర్​లోని ఈఎస్‌ఐ వైద్యశాలలో...కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ఎర్రగడ్డలోని ఛాతి హాస్పిటల్​లో రోగులకు పండ్లు పంచారు. ప్రహ్లాద్​ జోషితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

హైదరాబాద్​లో విష జ్వరాలు, వాతావరణ కాలుష్యం ఎక్కువైందని, వెంటనే వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మంత్రి కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకొని భాజపా నాయకులు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.

రోగులకు పండ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రులు

ఇదీ చదవండిః 'కచ్చులూరు గ్రామప్రజల సహాయం మరచిపోలేం'

ABOUT THE AUTHOR

...view details