తెలంగాణ

telangana

Ayush-64: ఆయుష్​-64 మందును ప్రారంభించిన కిషన్​ రెడ్డి

By

Published : Jun 1, 2021, 3:51 PM IST

హైదరాబాద్​ ఎర్రగడ్డలోని సెంట్రల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ప్రాంగణంలో ఆయుష్​ 64(Ayush-64) మందు పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రారంభించారు. కరోనా బాధితుల కోసం ఆయుష్ డిపార్ట్​మెంట్ ఆయుష్​ 64ను అభివృద్ధి చేసింది.

kishan reddy
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

కరోనా బాధితుల కోసం ఆయుష్ డిపార్ట్​మెంట్ అభివృద్ధి చేసిన ఆయుష్​ 64(Ayush-64) మందును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రారంభించారు. హైదరాబాద్​ ఎర్రగడ్డలోని సెంట్రల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. స్వల్ప లక్షణాలు ఉండి కరోనా బారిన పడిన వారికి ఈ ఆయష్ మందును పంపిణీ చేశారు.

గతంలో మలేరియా సోకిన వారికి ఉపయోగించిన ఈ డ్రగ్​ను ఇప్పుడు కొవిడ్ రోగులకు సైతం అందించాలని సర్కారు నిర్ణయించింది. సేవాభారతి సంస్థతో కలిసి ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్నవారికి ఈ మందును అందించనున్నారు. ఆయుర్వేదం మన జీవన విధానంలో భాగమన్నారు కిషన్​ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ విన్నా ఆనందయ్య మందు గురించే చెబుతున్నారన్న ఆయన... వేల మంది కరోనా మందు కోసం ఆనందయ్యను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Kishan reddy: వ్యాక్సినేషన్​ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు

ABOUT THE AUTHOR

...view details