తెలంగాణ

telangana

By

Published : Dec 20, 2020, 10:23 PM IST

ETV Bharat / state

జీవనజ్యోతి వద్ద క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొన్న కిషన్​ రెడ్డి

బేగంపేట్ జీవనజ్యోతిలో జరిగిన క్రిస్మస్​ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్​ కేకు కట్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ప్రేమాభిమానాలతో మెలగాలని సూచించారు.

జీవనజ్యోతి వద్ద క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొన్న కిషన్​ రెడ్డి
జీవనజ్యోతి వద్ద క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొన్న కిషన్​ రెడ్డి

సమాజంలో పౌరులందరూ తోటివారి పట్ల ప్రేమాభిమానాలు, ఆప్యాయతలతో మెలగాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. హైదరాబాద్​ బేగంపేట్​ జీవనజ్యోతిలో నిర్వహించిన క్రిస్మస్​ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

నేటి యువత క్రీస్తు చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక భాజపా నాయకులు, జీవనజ్యోతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ఎంతో మందిని చూశాం... కేసీఆర్​లాంటి సీఎంను చూడలేదు'

ABOUT THE AUTHOR

...view details