తెలంగాణ

telangana

రెండో​ వ్యాక్సిన్​ తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి​ కరోనా రెండో వ్యాక్సిన్​ వేయించుకున్నారు. టీకాపై అపోహలు మాని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్​ తీసుకోవాలని ఆయన సూచించారు.

By

Published : Apr 19, 2021, 6:49 PM IST

Published : Apr 19, 2021, 6:49 PM IST

Secunderabad Gandhi Hospital
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. గాంధీ ఆసుపత్రిలో కరోనా రెండో టీకాను తీసుకున్నారు. సెకండ్​ వేవ్​ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని కోరారు. టీకాపై అపోహలు మాని వ్యాక్సిన్​ తీసుకోవాలని సూచించారు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు కిషన్ రెడ్డి. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. మందులు, పడకల సమస్య రాకుండా చూడాలని సూచించారు.

ఇదీ చదవండి:వైద్యుల స్ఫూర్తిని దెబ్బతీయొద్దు: ఈటల

ABOUT THE AUTHOR

...view details