తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబారీపై... అమ్మవారు

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం తుదిదశకు చేరుకుంది. వేడుకలో కీలకమైన అమ్మవారి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది.

By

Published : Jul 22, 2019, 1:05 PM IST

Updated : Jul 22, 2019, 3:35 PM IST

అంబారీపై... అమ్మవారు

లష్కర్‌ బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం అమ్మవారి అంబారీ ఊరేగింపు. వందేళ్లకు పైగా కొనసాగుతున్న ఈ అంబారీ ఊరేగింపు అమ్మవారి వైభవాన్ని చూపుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ వేడుకను తిలకించేందుకు ఆలయ పరిసర ప్రాంత ప్రజలు, బస్తీలవాసులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఊరేగింపునకు కర్ణాటకలోని గుల్బర్గా నుంచి 'మేనక' అనే ఏనుగుని అధికారులు తీసుకొచ్చారు. అంబారీ ఊరేగింపుతో అమ్మవారి ఉత్సవాలు ముగియనున్నాయి.

అంబారీపై... అమ్మవారు
Last Updated : Jul 22, 2019, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details