తెలంగాణ

telangana

By

Published : Dec 15, 2019, 7:37 AM IST

ETV Bharat / state

నిర్బంధ తనిఖీల్లో ద్విచక్రవాహనాలు స్వాధీనం

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్​లో సైబరాబాద్ పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, 28 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Two wheelers, suspects in custody checks at chandanagar
నిర్బంధ తనిఖీల్లో ద్విచక్రవాహనాలు, అనుమానితులు

సైబరాబాద్ పోలీసులు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్​లో నిర్బంధ తనిఖీలు చేశారు. స్థానికంగా ఉన్న నివాసితులు, ఆధార్ కార్డులను పరిశీలించారు. 28 మంది అనుమానితులను, సరైన పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిర్బంధ తనిఖీల్లో ద్విచక్రవాహనాలు, అనుమానితులు

మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు సమక్షంలో నిర్వహించిన ఈ సోదాలలో అడిషనల్ డీసీపీ, ఏసీపీ, 11 సీఐలు, 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల్లో అభద్రతా భావం తొలగించి పోలీసులపై నమ్మకాన్నిపెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు డీసీపీ తెలిపారు.

ఇదీ చూడండి : త్వరలో "తెలంగాణ బచావో".. కాంగ్రెస్‌ ర్యాలీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details