తెలంగాణ

telangana

ETV Bharat / state

కానిస్టేబుల్​పై దాడి చేసిన నిందితులు అరెస్ట్ - కానిస్టేబుల్​పై దాడి

విధుల్లో ఉన్న కానిస్టేబుల్​పై దాడి చేసి పారిపోయిన ఇద్దరు నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

two-members-arrest-for-attack-on-constable-at-pathabasthi
కానిస్టేబుల్​పై దాడి చేసిన నిందితులు అరెస్ట్

By

Published : Apr 8, 2020, 7:34 PM IST

ఈనెల 4న హైదరాబాద్ పాతబస్తీ బాబా నగర్ సమీపంలోని గుల్షన్ ఇక్బాల్ కాలనీలోని మీ సేవ వద్ద ప్రజలు భారీగా గుమిగూడడంతో చాంద్రాయణ గుట్ట కానిస్టేబుల్ ప్రవీణ్ విధులు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో అమీనుద్దీన్ అనే యువకుడు తల్లితో వచ్చి దౌర్జన్యం చేస్తూ ముందు లైన్​లోకి వెళ్లాడు. అది గమనించిన ప్రవీణ్ అతన్ని క్యూ నుంచి పంపించి వేశాడు.

పగ పెంచుకున్న అమీనుద్దీన్, షేక్​ సైఫుద్దీన్​తో కలిసి ద్విచక్రవాహనంపై వచ్చి రాడ్​తో కానిస్టేబుల్​పై దాడి చేసి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. పారిపోయిన నిందితులను పోలీసుల ఇవాళ అరెస్టు చేసి... రిమాండుకు తరలించినట్లు చాంద్రాయణగుట్ట సీఐ రుద్ర భాస్కర్ తెలిపారు.

ఇవీచూడండి:'గన్నీ బ్యాగుల కొరత ఉత్పన్నం కాకుండా చర్యలు'

ABOUT THE AUTHOR

...view details