Bears In Temple: ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా రొళ్ల మండలం జీరిగెపల్లి గ్రామంలోని ఆలయంలో ఓ ఎలుగుబంటి గంట మోగించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. రాత్రి 9 గంటల సమయంలో రెండు ఎలుగుబంట్లు ఆలయ ప్రధాన ద్వారం నుంచి లోనికి ప్రవేశించాయి. ఆలయం లోపలికి ప్రవేశించిన ఎలుగుబంట్లలో.. ఒకటి గుడి గంటకు వేలాడుతున్న తాడును నోట్లో కరుచుకొని, ముందు కాళ్లతో లాగి గంటను మోగించింది.
ఆలయంలోనికి ప్రవేశించి గంట మోగించిన ఎలుగుబంటి.. ఎక్కడంటే..! - రొళ్ల మండలం తాజా వార్తలు
Bears In Temple: ఏపీలోని సత్యసాయి జిల్లాలో రాత్రి సమయంలో రెండు ఎలుగుబంట్లు గుడిలోకి ప్రవేశించాయి. రెండు ఎలుగుబంట్లలో ఓ ఎలుగుబంటి ఆలయంలో ఉన్న గంటను మోగించింది. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
![ఆలయంలోనికి ప్రవేశించి గంట మోగించిన ఎలుగుబంటి.. ఎక్కడంటే..! Bears In Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16799896-249-16799896-1667282537627.jpg)
Bears In Temple
ఆలయంలోనికి ప్రవేశించి గంట మోగించిన ఎలుగబంటి.. ఇది ఎక్కడంటే..!
ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటిని చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్లు తరచుగా వస్తుంటాయని, ఇప్పటి వరకు ఎవరికి ఏ హాని తలపెట్టలేదని ఆలయ అర్చకులు అంటున్నారు.
ఇవీ చదవండి: