తెలంగాణ

telangana

ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాలకు చకచకా ఏర్పాట్లు - తుంగభద్ర పుష్కరాల ఘాట్ల వార్తలు

తుంగభద్ర పుష్కరాలకు సమయం సమీపిస్తోంది. కొన్ని చోట్ల పనులు మొదలైనా ఇంకొన్ని మందకొడిగా సాగుతున్నాయి. ముహూర్తానికి వారం ముందే పనులు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్దేశించింది. మరి పనుల పురోగతేంటి? పనుల్లో పూర్తైందెంత? పెండింగ్‌ ఎంత?

తుంగభద్ర పుష్కరాలకు చకచకా ఏర్పాట్లు
తుంగభద్ర పుష్కరాలకు చకచకా ఏర్పాట్లు

By

Published : Nov 1, 2020, 8:24 AM IST

నవంబరు 20 నుంచి డిసెంబర్ ఒకటి వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. ఏపీ కర్నూలు జిల్లాలో 21 పుష్కర ఘాట్లు, రహదారులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 207 కోట్ల నిధులు మంజూరు చేసింది. టెండర్లు పిలిచి పనులూ అప్పగించింది. కొన్ని ఘాట్లలో పనులు జోరుగా సాగుతున్నా... నదిలో వరద ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిచోట్ల ఆలస్యం అవుతున్నాయి.

కర్నూలు, నందికొట్కూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్లకు వెళ్లొచ్చేందుకు వీలుగా రహదారులు వేస్తున్నారు. పనులను పరిశీలించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తేవాలని అధికారులను ఆదేశించారు.

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పుష్కరాలు నిర్వహిస్తామని బుగ్గన చెప్పారు. పుష్కరాలకు ప్రత్యేక వెబ్ సైట్ రూపొందిస్తున్నామని, ఈ- పాస్... బుక్‌ చేసుకుని పుష్కర స్నానం చేయాలని చెప్పారు.

ఇదీ చదవండి:రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు : సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details