తెలంగాణ

telangana

కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్ర: రమణ

By

Published : Oct 30, 2019, 5:38 PM IST

ఓ ఆర్టీసీ డ్రైవర్​ మనువడిగా... ఓ ఆర్టీసీ డ్రైవర్​ మేనల్లుడిగా... కార్మికుల ఉద్యమానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​. రమణ తెలిపారు. హైదరాబాద్​ సరూర్​నగర్​లో నిర్వహించిన సమరభేరిలో ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

TTDP STATE PRESIDENT L. RAMANA FIRE ON CM KCR ON TSRTC SAMARA BHERI MEETING AT HYDERABAD

'కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు'

రాష్ట్రంలో కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు సీఎం కేసీఆర్ చూస్తున్నారని తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​. రమణ ఆరోపించారు. హైదరాబాద్​ సరూర్​నగర్​లో నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల సమరభేరిలో పాల్గొన్న రమణ... ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ​సమ్మె ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కార్మికులు ఎంత ఐక్యంగా ఉన్నారో... ఇకముందూ అంతే ఐక్యంగా ఉండాలని సూచించారు. కుట్రలకు మోసపోకుండా కార్మికులు ఉద్యమించాలన్నారు. ఆర్టీసీ ఆస్తులను అనుచరులకు కట్టబెట్టాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details