అక్టోబర్ 16 నుంచి 24 వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగున్నాయి. ఈ క్రమంలో మాడవీధుల్లో స్వామి వారికి వాహన సేవలు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్ణయించింది. దర్శన టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతించనుంది.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు అనుమతి!
కరోనా కారణంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించారు. కానీ దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు మాత్రం భక్తుల సమక్షంలో జరగనున్నాయి. త్వరలో జరగనున్న ఈ వేడుకను తిరుమాఢ వీధుల్లో నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు అనుమతి!
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఇంఛార్జి ఈవో ధర్మారెడ్డి గురువారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 వరకు.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు. అలాగే కల్యాణ వేదిక వద్ద పుష్ప ప్రదర్శన, ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ సమీక్షలో తితిదే ఉన్నతాధికారులు, కలెక్టర్ భరత్ నారాయణగుప్తా పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నయనానందరకరం.. తిరుమలలో వైభవంగా శ్రీవారి చక్రస్నానం