తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజ్యాంగానికి లోబడి నూతన విద్యావిధానాన్ని సవరించాలి' - tsutf conduct save india day Satyagraha at hyderabad

రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా జాతీయ విద్యావిధానాన్ని సవరించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్​ చేస్తూ... టీఎస్​యూటీఎఫ్ ఆధ్వర్యంలో సేవ్ ఇండియా డే సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహించారు.

tsutf conduct save india day Satyagraha at hyderabad
రాజ్యాంగానికి లోబడి నూతన విద్యావిధానాన్ని సవరించాలి

By

Published : Aug 9, 2020, 4:30 PM IST

నూతన జాతీయ విద్యావిధానం అమలు ద్వారా విద్యావ్యాపారం మరింతగా పెరిగే ప్రమాదం ఉందని టీఎస్​యూటీఎఫ్ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి ఆందోళన వ్యక్తం చేశారు. భారత పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య (టీఎస్​యూటీఎఫ్) పిలుపు మేరకు ఇవాళ హైదరాబాద్​లోని టీఎస్​యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం వద్ద సేవ్ ఇండియా డే సత్యాగ్రహం నిర్వహించారు.

విద్యా కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కార్పొరేటీకరణకు అనుగుణంగా రూపొందిస్తున్న దీన్ని భారత రాజ్యాంగానికి లోబడి సవరించాలని డిమాండ్ చేశారు. ఆశ్రితుల ప్రయోజనాల కోసమే బీఎస్​ఎన్ఎల్​ను నాశనం చేశారు. రైల్వే రూట్లును ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులు అనుమతిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'కాపాడే క్రమంలో తెలిసింది..వీరంతా కరోనా బాధితులని'

ABOUT THE AUTHOR

...view details