తెలంగాణ

telangana

By

Published : Nov 26, 2019, 7:08 AM IST

Updated : Nov 26, 2019, 8:18 AM IST

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద ఉద్రిక్తత..

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి డిపోలకు తరలివస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేక కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు.

TSRTC workers  coming to the depots
డిపోలకు వస్తున్న కార్మికులు... అడ్డుకుంటున్న పోలీసులు

సమస్యల పరిష్కారం కోసం 52రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించిన ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేర్చుకోవాలంటూ డిపోలకు తరలివస్తున్నారు. అయితే విధుల్లో చేరే విషయంలో ప్రభుత్వం నుంచి అనుమతి లేదని అధికారులు వారికి చేర్చుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లోకి వచ్చిన సిబ్బందిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది.

తాత్కాలిక సిబ్బందితో అధికారులు యథావిధిగా బస్సులు నడిపిస్తున్నారు. పలు చోట్ల బస్సులు బయటకు పోకుండా కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారినిఅరెస్టు చేశారు.

డిపోలకు వస్తున్న కార్మికులు... అడ్డుకుంటున్న పోలీసులు

ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ

Last Updated : Nov 26, 2019, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details