తెలంగాణ

telangana

ETV Bharat / state

'పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బులను ఎత్తుకుపోయాడు' - tsrtc chit fund victims protest at rachakonda commissionearte

చిట్టీలు, ఫిక్స్​డ్ డిపాజిట్ల పేరుతో ఆర్టీసీ కార్మికుల నుంచి రూ. 6 కోట్లు వసూలు చేసి పారిపోయిన దిల్​సుఖ్​నగర్​ డిపో కంట్రోలర్​పై చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ సీపీ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

tsrtc  chit fund victims protest at rachakonda commissionearte
'పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బులను ఎత్తుకుపోయాడు'

By

Published : Sep 8, 2020, 9:57 PM IST

చిట్టీలు, ఫిక్స్​డ్ డిపాజిట్ల పేరుతో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల నుంచి రూ. 6 కోట్లు వసూలు చేసి పారిపోయిన దిల్​సుఖ్​నగర్​ ఆర్టీసీ డిపో కంట్రోలర్ కందూరి సురేందర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ను కలిసి పూర్తి వివరాలను అందిస్తామంటూ కమిషనరేట్​ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

తాము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకున్నామని బాధితులు వాపోయారు. తమకు న్యాయం జరిపించాలని, తమ పిల్లల పెళ్లిళ్లకు దాచిపెట్టిన డబ్బులను ఎత్తుకుపోయారని పలువురు ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details