tsicet seat allotment 2021 results: ఐసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఎంబీఏలో 19,867 సీట్ల కేటాయింపు పూర్తికాగా... మరో 5,421 సీట్లు మిగిలాయి. ఎంసీఏలో 2,535 సీట్ల కేటాయించగా... 41 సీట్లు మిగిలాయి.
సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 27 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి.. డిసెంబరు 1 నాటికి కాలేజీల్లో చేరాలని ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. మిగిలిన సీట్ల కోసం ఈనెల 28న ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 28, 29 తేదీల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పారు. ఈనెల 29న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుందని వెల్లడించారు. ఈనెల 30న ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయిస్తారు.