తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్మిక శాఖ భవన్​ వద్ద టీఎస్​యూఈఈబీయూ సభ్యుల నిరసన - latest news on artigen employees working at electricity department

రాష్ట్ర విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్​ఇబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని కోరుతూ టీఎస్​యూఈఈబీయూ సభ్యులు హైదరాబాద్​ ఆర్టీసీ కార్మిక శాఖ భవన్​ వద్ద నిరసనకు దిగారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్మిక శాఖ సంయుక్త కమిషనర్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

tsueebu members protest at hyderabad
కార్మిక శాఖ భవన్​ వద్ద టీఎస్​యూఈఈబీయూ సభ్యుల నిరసన

By

Published : Sep 23, 2020, 5:47 PM IST

తెలంగాణ విద్యుత్​ సంస్థలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆర్టిజన్​ కార్మికులకు ఏపీఎస్​ఈబీ సర్వీస్ నిబంధనలు వర్తింపజేయాలని రాష్ట్ర యునైటెడ్​ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల యూనియన్​ కోరింది. ఆర్టిజన్​ కార్మికుల పట్ల ప్రభుత్వం, విద్యుత్ సంస్థ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి వీడాలని టీఎస్​యూఈఈయూ ప్రధాన కార్యదర్శి గోవర్ధన్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు హైదరాబాద్​ ఆర్టీసీ క్రాస్​ రోడ్​లోని కార్మిక భవన్​ ఎదుట ధర్నాకు దిగారు.

విద్యుత్​ సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఒకే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి గోవర్ధన్​ విన్నవించుకున్నారు. ఆర్టిజన్​ కార్మికులకు ఏపీఎస్​ఈబీ సర్వీస్ నిబంధనలు వర్తించాలని.. వారికి పర్సనల్​ పేను బేసిక్​లో కలపాలని సూచించారు. వారి కాంట్రాక్ట్​ సర్వీసును పరిగణనలోకి తీసుకుని గ్రాట్యూటీ అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ చతుర్వేదికి వినతిపత్రాన్ని సమర్పించారు.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details