తెలంగాణ

telangana

By

Published : Mar 23, 2020, 1:13 PM IST

ETV Bharat / state

నిన్న స్వీయ నిర్బంధం... నేడు రోడ్లపై యథాతథం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్న ప్రజలు ఈ రోజు ఉదయం నుంచే యథాతథంగా రోడ్లపైకి వచ్చారు. వీరిలో కొందరు నిత్యవసర అవసరాలకు కోసం రాగా... మరికొందరు సొంత ఊర్లకు వెళ్లడానికి వచ్చారు. ఇలా అయితే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన లక్ష్య సాధన నెరవేరేనా అని కొందరు ఆందోళన వ్యక్తమవుతోంది.

ts-state-lockdown-effects-on-hyderabad-roads
నిన్న స్వీయ నిర్బంధలో... నేడు రోడ్లపై యథాతథం

కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం ఈ నెల 31 వరకు రాష్ట్రంలో లాక్​డౌన్​ చేసింది. నిన్న నిర్మానుష్యంగా మారిన ప్రాంతాలు ఈ ఉదయాన నగరంలోని ప్రధాన కూడళ్లన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం రోడ్ల మీద ఉన్న పరిస్థితి, వాహనదారుల అభిప్రాయాలను మా ప్రతినిధి సతీశ్ ద్వారా తెలుసుకుందాం.

నిన్న స్వీయ నిర్బంధం... నేడు రోడ్లపై యథాతథం..

ABOUT THE AUTHOR

...view details