తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో కారుకు బ్రేకులు పడనున్నాయి: దత్తాత్రేయ

ఇవాళ రాష్ట్ర బంద్​కు భాజపా పిలుపునివ్వగా... ఎక్కడిక్కడ అరెస్ట్​లు జరుగుతున్నాయి. సచివాలయం గేటు ముందు ఆందోళన చేపట్టిన భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

By

Published : May 2, 2019, 12:58 PM IST

రాష్ట్రంలో కారుకు బ్రేకులు పడనున్నాయి: దత్తాత్రేయ

హైదరాబాద్ సచివాలయం గేటు ఎదుట భాజపా నేతలు దత్తాత్రేయ, మురళీధర్‌రావు ఆందోళన చేపట్టారు. గ్లోబరీనా, ఇంటర్‌ బోర్డు అధికారులపై చర్యలకై భాజపా నేతలు డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన నేతలను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్​రెడ్డిని బర్తరఫ్ చేయాలని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ డిమాండ్​ చేశారు. ఇక రాష్ట్రంలో కారుకు బ్రేకులు పడనున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కారుకు బ్రేకులు పడనున్నాయి: దత్తాత్రేయ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details