తెలంగాణ

telangana

ETV Bharat / state

'రీజినల్ రింగ్​రోడ్​కు రూ.1500 కోట్లు'

మాదాపూర్ హైటెక్స్​ ఎగ్జిబిషన్ సెంటర్ నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షోకు ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్​లో స్థిరాస్తి రంగా బాగా వృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. 368 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్​రోడ్​ను ఏర్పాటు చేస్తున్నట్లు కవిత తెలిపారు.

By

Published : Feb 15, 2019, 2:16 PM IST

క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభించిన కవిత

హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్​ ఎగ్జిబిషన్​ సెంటర్​లో క్రెడాయ్​ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. 150 స్టాళ్లతో 15 వేల ప్రాపర్టీలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఐదేళ్లుగా హైదరాబాద్​లో స్థిరాస్తి రంగం బాగా అభివృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందన్నారు. జిల్లాలను అనుసంధానం చేసే విధంగా 368 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్​ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు తప్పకుండా బీమా చేయించాలని కవిత సూచించారు.
క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభించిన కవిత

ABOUT THE AUTHOR

...view details