తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉగ్రచర్యపై ఉక్కుపాదం తప్పదు

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల ఆత్మశాంతికై నగరంలో భాజపా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది.

By

Published : Feb 16, 2019, 6:13 AM IST

Updated : Feb 16, 2019, 10:08 AM IST

ర్యాలీ

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల ఆత్మశాంతికై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయం నుంచి గోషామహాల్‌ మైదానం వరకు కొవ్వొత్తులతో నడిచారు. ఈ ర్యాలీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జవాన్లపై ఉగ్రవాదుల దాడి హేయమైనదని లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ప్రధాని ఉపేక్షించరని స్పష్టం చేశారు. దేశ రక్షణ కోసం యుద్ధం చేసేందుకు ప్రతీ పౌరుడు సిద్ధంగా ఉన్నారని రాజాసింగ్‌ పేర్కొన్నారు.

వీర జవాన్లకు నివాళి
Last Updated : Feb 16, 2019, 10:08 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details