హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానాల్లో రిజర్వేషన్ల విధానం లేకపోయినప్పటికీ... సముచిత ప్రాధాన్యం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ నుంచి సిఫార్సు అవుతున్న జాబితాలో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత లేకపోవడం బాధాకరమని వినోద్ వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులుగా తెలంగాణేతర న్యాయవాదులకు అవకాశం ఇవ్వడం కూడా మంచిది కాదన్నారు. ఈ విషయాలన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లక తప్పదని వినోద్ అన్నారు. రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడిగా వినోద్ నియమితులైన సందర్భంగా న్యాయవాదులు తెలంగాణ భవన్లో ఆయనను సన్మానించారు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కి పెంచాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లేఖ రాశారని గుర్తు చేశారు.
దేశం ఓ మహానాయకుడిని కోల్పోయింది: వినోద్