తెలంగాణ

telangana

ETV Bharat / state

సమ్మె విరమించి... చర్చలకు సిద్ధంకండి: కేకే - సమ్మె విరమించి... చర్చలకు సిద్ధంకండి: కేకే

ముఖ్యమంత్రి ఆదేశిస్తే...ఆర్టీసీ కార్మికులతో చర్చించేందుకు సిద్ధమేనని కేకే పేర్కొనడాన్ని... కార్మిక సంఘాల ఐకాస స్వాగతించింది. చర్చలకు ఆహ్వానిస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ప్రయాణికుల ఇబ్బందులను నివారించే దిశగా.. రవాణా సంస్థ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

సమ్మె విరమించి... చర్చలకు సిద్ధంకండి: కేకే

By

Published : Oct 15, 2019, 4:28 AM IST

Updated : Oct 15, 2019, 4:53 AM IST

ముఖ్యమంత్రి కేసీర్​ ఆదేశిస్తే.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఐకాస నేతలతో చర్చించనున్నట్లు... తెరాస రాజ్యసభ సభ్యుడు కేకే వెల్లడించారు. తెరాస పార్లమెంటారీ నేత కేకే... దిల్లీ నుంచి హైదరాబాద్​కు చేరుకున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు మధ్యవర్తిత్వం వహించమని కోరిన విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. కార్మికులు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొని.. వెంటనే సమ్మెను విరమించాలని కోరారు.

తెరాస ఎంపీ కేశవరావు చర్చల ప్రతిపాదనను.. ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు స్వాగతించారు. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే..... ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమేనని స్పష్టం చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసిన ఐకాస నేతలు... ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలను వివరించారు.

ప్రయాణికుల ఇబ్బందులను నివారించే దిశగా ప్రజా రవాణాను మెరుగు పరిచేందుకు రవాణా సంస్థ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బస్సుల్లో టిక్కెట్​ విధానంను పునరుద్ధరించారు. నిన్న సాయంత్రం 6 గంటల వరకు 54.35శాతం మేర బస్సులు నడిపినట్లు అధికారులు వెల్లడించారు.

సమ్మె విరమించి... చర్చలకు సిద్ధంకండి: కేకే

ఇదీ చూడండి: 'కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధం'

Last Updated : Oct 15, 2019, 4:53 AM IST

ABOUT THE AUTHOR

...view details