తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల్లో గెలుపోటములు సర్వ సాధారణం

ఇక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ... వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. హైదరాబాద్​ అంబర్​ పేటలోని త్రిశూల్​ కన్వెన్షన్​ హాల్లో కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. సికింద్రాబాద్​ నుంచి గెలిచిన భాజపా ఎంపీ అభ్యర్థి కిషన్​రెడ్డికి అభినందనలు తెలిపారు.

By

Published : May 25, 2019, 3:40 PM IST

Updated : May 25, 2019, 7:55 PM IST

తలసాని శ్రీనివాస్​

ఎన్నికల్లో గెలుపోటములు సర్వ సాధారణమని రాష్ట్ర పశు సంవర్థక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. హైదరాబాద్​ అంబర్​ పేటలోని త్రిశూల్​ కన్వెన్షన్​ హాల్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో సికింద్రాబాద్​ తెరాస ఎంపీగా పోటీ చేసిన మంత్రి కుమారుడు సాయి కిరణ్​ యాదవ్​, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్​, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ హవాతో ఇక్కడ భాజపా గెలిచిందని అభిప్రాయపడ్డారు. ఇక పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. తన కుమారుడు గెలవాలని కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ఇక ప్రజలతో మమేకమవుతామని పేర్కొన్నారు.

కార్యకర్తలతో సమావేశమైన మంత్రి తలసాని శ్రీనివాస్​
Last Updated : May 25, 2019, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details