తెలంగాణ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈవీ పాలసీని తీసుకువచ్చిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada) తెలిపారు. కొనుగోలు దారులకు ప్రోత్సహాకాలు కూడా ప్రకటించిందని చెప్పారు. ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో ప్యాసింజర్ ఎలక్ట్రికల్ ఆటోను ప్రారంభించిన మంత్రి కొద్దిసేపు ఆటోను సరదాగా నడిపారు. వాహనాల పికప్ బాగా ఉందని కితాబునిచ్చారు.
రిజిస్ట్రేషన్ ఫీజు, క్వార్టర్లీ ఫీజును మాఫీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈవీ పాలసీలో 264 కోట్ల భారం పడినప్పటికీ వాయు కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేసిందని మంత్రి వివరించారు. హైదరాబాద్ నగరంలో 5వేల ఎలక్ట్రికల్ ఆటోలకు అనుమతి ఇచ్చామని... ప్రస్తుతం 26 ప్యాసింజర్ ఆటోలు రిజిస్ట్రేషన్ అయ్యాయని మంత్రి పేర్కొన్నారు.