సికింద్రాబాద్లో గత 15 రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనలో గాయపడ్డ ఆరేళ్ల చిన్నారి శివాని చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యుత్ అధికారుల నిర్లక్షమే కారణమంటూ... చిన్నారి మృతదేహంతో బోయినపల్లి డీఈ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కుటుంబ సభ్యుల రోదనలతో డీఈ ఆఫీస్ ప్రాంగణం మిన్నంటింది.
'మా బిడ్డ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే చనిపోయింది' ఏం జరిగిందంటే...!
ద్విచక్రవహనంపై తండ్రి, ఇద్దరు చిన్నారులతో వెళ్తుండగా... ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో పెద్ద కుమార్తె శివానికి, చిన్న కుమార్తె సాయిప్రియకు తీవ్రగాయలయ్యాయి. గత కొద్ది రోజులుగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శివాని పరిస్థితి విషమంచి.. ఇవాళ ఉదయం మరణించింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆపరేషన్ కశ్మీర్: ఆర్టికల్ 370 అంటే ఏమిటి?