లక్ష్యం: ప్రధానిగా రాహుల్
లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు ప్రారంభించింది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకు కృషి చేస్తున్నామని టీపీసీసీ నేతలు పేర్కొన్నారు.
సమావేశం
దేశంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి భాజపా పాలన సాగిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా విమర్శించారు. మోదీని ఓడించి.. రాహుల్ గాంధీని ప్రధానిగా ఎన్నుకునేందుకు యావత్ దేశం ఎదురుచూస్తోందని తెలిపారు.
నేడు నాగర్కర్నూల్, మహబూబ్నగర్, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలపై చర్చించనున్నారు. రేపు చేవెళ్ల, మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్ అభ్యర్థులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Last Updated : Feb 16, 2019, 11:34 AM IST