TPCC Meeting in Gandhi Bhavan Today : పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు శ్రమించారని, వారి త్యాగాల ఫలితంగానే కాంగ్రెస్(Congress Party) అధికారంలోకి వచ్చిందని మంత్రులు తెలిపారు. గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించిన తెలంగాణ ప్రజలకు, పార్టీ విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు.
నామినేటెడ్ పదవుల భర్తీకి వేగం పెంచిన కాంగ్రెస్ - ఈ సంక్రాంతికే పూర్తి చేసేలా చర్యలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచిత బస్ సౌకర్యం విజయవంతం అయ్యిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్యకర్తల కష్టంతోనే ప్రభుత్వంలోకి వచ్చామని, వారి కష్టాల్లో పాలు పంచుకొంటూ సహకారాన్ని అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam) తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా ఒక్క కుటుంబంగా పని చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులతో పీసీసీ వారి వారి అభిప్రాయాలను తెలుసుకుంది. పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని పలువురు నాయకులు విజ్ఞప్తి చేశారు.
Congress Latest News : జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించాలని నాయకులు, కార్యకర్తలు కోరారు. పార్టీ గెలుపునకు పని చేసిన వారిందరికీ న్యాయం జరిగేట్లు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. దశాబ్ద కాలం తర్వాత రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్కు గొప్ప అవకాశం ఇచ్చారని, మార్పును కోరుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందామని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.