తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2021, 5:52 PM IST

ETV Bharat / state

TPCC Uttam: ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటాం: ఉత్తమ్​

కరోనాతో మృతిచెందిన కాంగ్రెస్​ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన గాంధీభవన్ ఉద్యోగి షబ్బీర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. హైదరాబాద్​ నాంపల్లిలోని పటేల్​నగర్​లో ఉన్న నివాసానికి వెళ్లి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

TPCC chief uttam kumar reddy
గాంధీభవన్ ఉద్యోగి షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

కార్యకర్తల కృషిని కాంగ్రెస్ ఎప్పటికీ మరిచిపోదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గాంధీభవన్ ఉద్యోగి షబ్బీర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని పటేల్​నగర్​లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులోనూ సాయం చేస్తామని వారి కుటుంబానికి హామీనిచ్చారు.

కాంగ్రెస్​లో కొనసాగుతూ ఇటీవల మృతి చెందిన నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని ఉత్తమ్‌ వెల్లడించారు. పార్టీకి వారు చేసిన సేవలను ఎప్పుడూ మరిచిపోదన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సంక్షేమమే అంతిమ లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:KTR: 'హెల్త్‌కేర్ వర్కర్లను దేవునితో సమానంగా చూస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details