కాంగ్రెస్ హయాంలో గౌరవంగా బతికిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నేడు ఆత్మగౌరవంతో బతకలేని పరిస్థితి ఏర్పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)అన్నారు. కేసీఆర్ (Cm kcr) కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణను విముక్తి చేసేందుకు తాను శాయశక్తులా పనిచేస్తానని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూల తనతో పాటు సీతక్క కూడా తిరుగుతుందని చెప్పారు.
నా కొడంగల్ నియోజకవర్గంలో నేను చెబుతున్న ప్రతి ఆర్నెళ్లకు ఎస్సై బదిలీ అయితున్నడు. ఎందుకయ్య ఈ తీరుగా బదిలీ అయితున్నరు అని అడిగితే? ఆర్నెళ్లకు రూ. 10 లక్షలు ఇయ్యాల్నంట. ఐదు పోలీస్ స్టేషన్లు ఉన్నయి. పోస్టింగ్ వేయించేటపుడు రూ. 10 లక్షలు.... ప్రతినెల రూ. 5 లక్షలు ఫిక్స్డ్ మామూలు. సీఐకిరూ. 25 లక్షలు పోస్టింగ్కు...నెలకు ఐదు లక్షలో 10 లక్షలో మామూలంట. పోలీసులను, పంచాయతీ రాజ్ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులకు నెల వారీగా మామూలు ఫిక్స్ చేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వసూలు చేసుకుంటున్నరు.
--- రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
కేసీఆర్ మీద కొట్లాడడానికి తనలాంటి ఎంతో మంది నాయకులు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారని రేవంత్ స్పష్టం చేశారు. కళ్ల ముందు కనిపించే తెలంగాణ తల్లి సోనియాగాంధీ అని కొనియాడారు. సోనియాగాంధీ తెలంగాణను ఇస్తే ఇవాళ రాష్ట్రం దొంగలపాలైందని విమర్శించారు. కేసీఆర్కు కంటిమీద కునకు లేకుండా చేస్తానని రేవంత్ అన్నారు.
కంటిమీద కునుకు లేకుండా మీకోసం కొట్లాడుతాం. కరెంట్ తీగలా కాదు హైటెన్షన్ వైర్లా ఉండి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను కాపాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు, సర్పంచ్లు, ఎంపీటీసీల ఆత్మగౌరవం పెరిగేవిధంగా కొట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కళ్లముందు కదలాడే తెలంగాణ తల్లి సోనియాగాంధీ. సోనియాగాంధీ రూపంలో తెలంగాణ తల్లి మన ముందు ఉంది. మన కష్టాలను చూసి తెలంగాణ ఇస్తే... ఇయ్యాల రాష్ట్రం దొంగలపాలైంది. దొంగలను తరిమికొట్టి కంచెవేసి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తపై ఉంది. కేసీఆర్... ఇక నీకు కంటిమీద కునుకు లేకుండా చేస్తా!
--- రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Revanth Reddy: 'కేసీఆర్... ఇక నీకు కంటిమీద కునుకు లేకుండా చేస్తా' ఇదీ చదవండి: