తెలంగాణ

telangana

ETV Bharat / state

Uttam Kumar Reddy: కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలు మోసపోతున్నారు: ఉత్తమ్ - తెలంగాణ వార్తలు

కేసీఆర్ హయాంలో ఎస్సీ, ఎస్టీలు మోసపోతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అడ్డగూడూరులో పోలీసుల కస్టడీలో మరియమ్మ అనే మహిళ మృతిపై స్పందించారు. దళిత ఆవేదన దీక్ష పేరుతో హైదరాబాద్​లోని గాంధీభవన్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

uttam kumar, gandhi bhavan
ఉత్తమ్ కుమార్, గాంధీ భవన్

By

Published : Jun 26, 2021, 3:01 PM IST

Updated : Jun 26, 2021, 3:45 PM IST

ఉత్తమ్ కుమార్, గాంధీ భవన్

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు మోసానికి గురవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అన్యాయానికి గురైన దళితులందరికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పోలీసుల కస్టడీలో మరియమ్మ అనే ఎస్సీ మహిళ మృతిచెందిన ఘటనపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దళిత ఆవేదన దీక్ష పేరుతో హైదరాబాద్​లోని గాంధీభవన్​లో కాంగ్రెస్ నేతలు కార్యక్రమం నిర్వహించారు.

సీఎంకు నైతిక హక్కు లేదు

మరియమ్మ ఘటన గురించి తెలియదన్న సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. ఇవాళ దళితుల సాధికారిత గురించి మాట్లాడుతున్న సీఎం... ఏడేళ్ల కాలంలో వారి అభివృద్ధి గురించి ఎందుకు ఆలోచించలేదని నిలదీశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు ఆవేదన చెందుతున్నారని దాసోజు శ్రవణ్ అన్నారు. 2018 నుంచి ఇప్పటివరకు 116 ఎస్సీ, ఎస్టీల హత్యలు జరిగాయని... దాదాపు 6 వేల అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారందరికీ న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

నివాళులు

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ 'దళిత ఆవేదన దీక్ష'దీక్షలో పాల్గొన్న నేతలు అడ్డగూడూరు ఠాణాలో చనిపోయిన మరియమ్మకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, జాతీయ ఎస్సీ విభాగం అధ్యక్షుడు రావత్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పీసీసీ ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ ప్రీతం తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:KCR Review: జులై 1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు

Last Updated : Jun 26, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details