తెలంగాణ

telangana

By

Published : Jul 16, 2020, 4:19 PM IST

ETV Bharat / state

ఏపీలో కొత్తగా 2,593 మందికి కరోనా.. 24గంటల్లో 40 మంది మృతి

ఆంధ్రప్రదేశ్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా గురువారం 2 వేల 593 మంది కొవిడ్​ బారిన పడ్డారు. 24 గంటల్లో 40 మంది మరణించారు.

ఏపీలో కొత్తగా 2,593 కరోనా కేసులు.. 24 గంటల్లో 40 మంది మృతి
ఏపీలో కొత్తగా 2,593 కరోనా కేసులు.. 24 గంటల్లో 40 మంది మృతి

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 2,593 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 38,044కు చేరింది. గడిచిన 24 గంటల్లో వైరస్​ బారిన పడి 40 మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 492కు చేరింది. 19,393 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా.. 18,159 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ 12.40 లక్షల మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఏపీలో జిల్లాల వారీగా కేసులు

ABOUT THE AUTHOR

...view details