తెలంగాణ

telangana

By

Published : May 19, 2021, 12:59 PM IST

ETV Bharat / state

టాప్‌టెన్‌ న్యూస్‌ @1 PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news till now
టాప్‌టెన్‌ న్యూస్‌ @1 PM

గాంధీలో సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. హాస్పిటల్‌లో.. కొవిడ్‌ చికిత్సలు, ఇతర సదుపాయాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి.. వైద్యులతో సమీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

టెండర్లకు ఆహ్వానం

కొవిడ్‌ టీకాల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు కోటి డోసుల కరోనా టీకాల కోసం టెండర్లకు ఆహ్వానం పలికింది. నెలకు కనీసం 15 లక్షల చొప్పున 6 నెలల్లో కోటి డోసులు సరఫరా చేయాలని నిబంధన విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బ్లాక్ మార్కెట్​కు తరలనివ్వం..

రాష్ట్రంలో ఆక్సిజన్.. బ్లాక్ మార్కెట్​కు తరలకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. సిలిండర్లు సరఫరా చేసే డీలర్లపై నిఘా పెంచింది. ఆరు ప్రభుత్వ శాఖలతో వంద ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. ఆక్సిజన్ సరఫరా విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆర్టీసీ అద్దె కష్టాలు..

ఆర్టీసీతో.. అద్దె బస్సుల నిర్వాహకులు అనేక అవస్థలు పడుతున్నారు. గతేడాది లాక్‌డౌన్‌తో సుమారు ఏడు నెలలపాటు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తాజా లాక్‌డౌన్‌తో వారం రోజుల నుంచి బస్సులు షెడ్డుల్లోనే ఉంటున్నాయి. ఓ వైపు బస్సులు నడవక మరో వైపు వాటికి రావాల్సిన బకాయిలు రాక.. నిర్వాహకులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


ఎన్‌ 95ను ఉతకొచ్చా?

ఒక ఎన్‌95 మాస్కును ఎన్ని రోజులు, ఎన్ని గంటలు వాడుకోవాలి? కొందరు ఒక మాస్కునే ఉతికి మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ఇది మంచిదేనా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ట్రయల్స్​పై స్టేకు నిరాకరణ

2 నుంచి 18 ఏళ్ల వారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా స్టే విధించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. చిన్నారులపై క్లినికల్ పరీక్షలకు డీసీజీఐ అనుమతి ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సత్తా చాటిన భారత్, చైనా!

ఎగుమతులు- దిగుమతుల విషయంలో భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు మెరుగైన ఫలితాలు రాబట్టాయని ఐరాస తెలిపింది. క్యూ 1లో భారతదేశ వస్తువుల దిగుమతులు 45శాతం, సేవల దిగుమతులు 14 శాతం పెరిగాయని వెల్లడించింది. చైనా ఎగుమతులు కరోనా పూర్వ స్థితి కన్నా మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

భారత్​కు భారీ సాయం

భారత్​లో కొవిడ్​ ఉపశమన చర్యలకు 1 మిలియన్​ యూరోల (సుమారు రూ.9కోట్లు) సాయాన్ని ప్రకటించింది ప్రముఖ ఔషధ సంస్థ బోహ్రింజర్​ ఇంగెల్​హీమ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

గెస్ట్ హౌజ్​లో వ్యాక్సినేషన్

కరోనా వ్యాక్సిన్ టీమ్ఇండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్​కు చిక్కులు తెప్పించింది. అతడు టీకాను ఆస్పత్రిలో కాకుండా గెస్ట్ హౌజ్​లో వేసుకోవడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బర్త్‌డే వేడుకలు వద్దు..

టాలీవుడ్​ స్టార్​ హీరో జూనియర్​ ఎన్టీఆర్​.. మే20న తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని అభిమానుల్ని కోరారు. ఇంటివద్దనే ఉండి కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు. వైరస్​ బారిన పడి ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details