తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Feb 8, 2021, 8:58 PM IST

top ten news for 9pm
టాప్​టెన్​ న్యూస్​@9PM

ఆ 202 మంది ఎక్కడ?

ఉత్తరాఖండ్​లో మెరుపు వరదల కారణంగా ఇప్పటివరకు 18మంది మరణించారు. మరో 202మంది గల్లంతయ్యారు. వీరికోసం సైన్యం, ఎన్డీఆర్​ఎఫ్​, ఐటీబీపీ బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నాయి. గల్లంతైన వారి ప్రాణాలు కాపాడటానికే ప్రభుత్వం ప్రాధన్యమిస్తుందని సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు.పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

జిల్లా, మండల పరిషత్​లకు నిధులు

పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఇస్తున్న నిధుల మాదిరిగానే జిల్లా పరిషత్, మండల పరిషత్​లకు కూడా నిధులు కేటాయిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

రైతు రాత మారింది

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో రైతుల జీవితాల్లో గణనీయ ప్రగతి వచ్చిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పర్యటించిన మంత్రి... అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

రికార్డు ధర

జగిత్యాల జిల్లా మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్​లో పసుపు పంటకు రికార్డు ధర వచ్చింది. రైతు మహదేవ్​ పంటను... పుల్లూరి నవీన్​ ట్రేడర్స్ రూ.7111కు క్వింటాల్​ చొప్పున కొనుగోలు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

బీసీలకు అన్యాయం

రాష్ట్రం ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లేఅవుట్​లో ప్రభుత్వం కేటాయించిన.. బీసీల ఆత్మగౌరవ భవనాల స్థలాలను ప్రభాకర్​తో కలిసి పరిశీలించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

చర్చలకు సిద్ధం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు చర్చలకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో కోరిన నేపథ్యంలో రైతు సంఘాలు స్పందించాయి. తాము చర్చలకు సిద్ధమేనని తెలిపాయి.పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

భారత్​వైపే చూస్తోంది

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడారు. భారత్​లో అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రపంచం మొత్తం భారత్​వైపే చూస్తోందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

రంకెలేసిన బుల్

మార్కెట్​లో బుల్ హవా కొనసాగింది. 617 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. 192 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ 15,116 వద్ద ముగిసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

గెలిపిస్తారా.. డ్రా చేస్తారా..

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్​ఇండియా 381 పరుగుల వెనుకంజలో ఉంది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్​లో వికెట్​ కోల్పోయి 39 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(12), గిల్​(15) ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

రాజమౌళి ప్రశంసలు!

'జాంబీరెడ్డి' ఆకట్టుకున్న ప్రశాంత్​ వర్మతో రాజమౌళి ముచ్చటించారు. అతడిని మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రశాంత్ ట్విట్టర్​ పోస్ట్ పెట్టాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details