తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Dec 23, 2020, 8:59 PM IST

top ten news for 9pm
టాప్​టెన్​ న్యూస్​@9PM

నిధులు ఇవ్వండి

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2021-22 బడ్జెట్‌లో ప్రాజెక్టు వ్యయంలో కనీసం సగం మొత్తం కేటాయించాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

దా'రుణ' యాప్​లు

ఆన్​లైన్​లో రుణాలిచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తున్న మొబైల్​ యాప్​ల దారుణాలపై ఆర్​బీఐ స్పందించింది. ఆర్​బీఐ గుర్తింపు పొందని యాప్​లో రుణాలు తీసుకుని ఇబ్బందుల్లో చిక్కుకోకూడదని ప్రజలకు సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

బీ అలర్ట్

కొత్త రకం కరోనా వైరస్‌తో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. యూకే నుంచి వచ్చిన వారి వివరాలు ఆరా తీయాలని అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

దయనీయస్థితిలో

ముఖ్యమంత్రి కేసీఆర్​ తీరుపై మరోసారి మండిపడ్డారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి. సీఎం తీసుకున్న గ్రామాలు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సింగరేణి ఆవిర్భావ వేడుకలు

సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్​లోని ప్రధాన కార్యాలయంలో సింగరేణి పతాకాన్ని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆవిష్కరించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం సింగరేణికి ఉందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

చర్చలకు సిద్ధం

నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే చర్చలకు సిద్ధమని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలపై అర్థంలేని సవరణలను తమ వద్దకు తీసుకురావొద్దని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

చర్చలకు రండి

వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలు ఇంకా చాలా ఉన్నాయన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు త్వరలోనే కేంద్రంతో మరోసారి చర్చించడానికి ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

13,600పైకి నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 437 పాయింట్లు బలపడి 46,440పైకి చేరింది. నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 13,600 మార్క్ దాటింది. హెచ్​యూఎల్ అత్యధికంగా 2.50 శాతానికిపైగా లాభాలన్ని గడించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

క్రీడా వివాదాలు..

ప్రతి ఏడాది ఎన్నో సంఘటనలు జ్ఞాపకాలుగా నిలుస్తాయి. కానీ ఈ 2020ను రివైండ్‌ చేసుకుంటే మహమ్మారి కరోనానే అందరి జీవితాల్లో సింహభాగంగా నిలిచింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అందరూ చూడొచ్చు

అందాలతార శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్, అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా.. తమ ఇన్​స్టా ఖాతాలను పబ్లిక్ చేశారు. వారు ఏమేం పంచుకున్నారో మీరూ ఓ లుక్కేయండి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details