తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Jul 9, 2020, 8:59 PM IST

top ten news for 9pm
టాప్​టెన్​ న్యూస్​@9PM

అగ్రరాజ్యం సైతం తెలంగాణపైనే ఆధార పడుతోంది: మంత్రి కేటీఆర్

యూఎస్​ ఐబీసీ ఇన్వెస్ట్​మెంట్​ వెబినార్​లో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. అమెరికన్​ కంపెనీల అధినేతలకు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఇదేం న్యాయం... ప్లకార్డు పట్టుకుంటేనే అరెస్టు చేస్తారా: రేవంత్​

కాంగ్రెస్ కార్యకర్త సాయిబాబా అరెస్ట్‌పై కమిషనర్‌తో ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్లకార్డు పట్టుకుంటే అరెస్టు చేయడమేంటని సీపీని రేవంత్​ ప్రశ్నించారు. కేసును పరిశీలించి వదిలేస్తామని సీపీ... రేవంత్​కు తెలిపారు. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

జన సమీకరణ ఎలా చేస్తారు: హైకోర్టు

జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి.. నిమ్జ్ ఏర్పాటుపై జరగాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. కరోనా దృష్ట్యా.. రేపటి ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మరోసారి భూ ప్రకంపనలు... ఇళ్లలోనుంచి పరుగులు తీసిన ప్రజలు

సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఇవాళ మధ్యాహ్నం నాలుగు సెకన్లపాటు సంభవించిన ఈ ప్రకంపనల వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'సైనిక ఉపసంహరణే... ఉద్రిక్తతలకు ముగింపు కాదు'

లద్దాఖ్​లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారత్​- చైనా తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. దీని అర్థం ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గినట్లు కాదని సైనిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కరోనా మందుల దందా- ధర 6 రెట్లు అధికం

కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు డ్రగ్ వ్యాపారులు మాత్రం డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కొవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించే రెమ్​డెసివిర్​ను బ్లాక్​మార్కెట్​లో విక్రయిస్తున్నారు. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

సరిహద్దుల్లో దేశం కోసం.. గ్రామ శివారులో కుటుంబం కోసం

దేశ సరిహద్దుల్లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న ఓ జవాన్​... ఇటీవల స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో నేరుగా ఊరులోకి వెళ్లకుండా గ్రామ శివారులో తన పొలంలో ట్రాక్టర్​పై టెంట్​ వేసుకుని క్వారంటైన్​లో ఉన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

టీసీఎస్​పై కరోనా దెబ్బ- రూ.1123కోట్లు తగ్గిన లాభం

తొలి త్రైమాసికంలో సాఫ్ట్​వేర్ దిగ్గజం టీసీఎస్ నికర లాభం 13.8 శాతం తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.8,131 కోట్ల నికర లాభం పొందగా.. ఈ సారి రూ.7008 కోట్లకే పరిమితమైంది. ఆదాయం మాత్రం సల్వంగా పెరిగింది. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

సచిన్, కోహ్లీ బంతికి చిక్కిన ప్రముఖ క్రికెటర్లు వీరే

టీమ్​ఇండియా క్రికెట్ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ. బ్యాట్​తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. కొన్నిసార్లు బంతితోనూ మెరిశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మిచెల్ ఒబామా, మెగన్ మార్కెలతో ప్రియాంక చోప్రా

ఈనెల 13 నుంచి 15వ తేదీల మధ్య వర్చువల్​ విధానంలో జరిగే 'గర్ల్‌అప్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌'లో ప్రత్యేక అతిథిగా పాల్గొనుంది నటి ప్రియాంక చోప్రా. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్​లో వెల్లడించింది. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details