తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Dec 31, 2020, 4:49 PM IST

top ten news for 5pm
టాప్​టెన్​ న్యూస్​@ 5PM

జనవరి మూడో వారంలో

జనవరిలోపు అన్నిశాఖల్లో పదోన్నతులు పూర్తి చేస్తామని ఉద్యోగులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. జనవరి 6, 7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సీఎస్ కమిటీని ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

రెండు నెలల్లో పరిష్కారం

ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

లక్ష్యాలు ఉండాల్సిందే..

2020లో కరోనా మహమ్మారితో చాలా ఇబ్బందులు పడ్డామనీ... వాటి నుంచి తేరుకుని 2021కు స్వాగతం పలకాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

'డ్రై రన్​'

కరోనా వ్యాక్సిన్​ పంపిణీలో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన డ్రై రన్​ విజయవంతమైనట్లు ప్రకటించింది కేంద్రం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్​ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఇదీ ప్రజాస్వామ్యంటే

కేరళలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు... పని చేస్తున్న బ్లాకు పంచాయతీకే అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం తరఫున పోటీ చేసి విజయం సాధించారామె. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కుక్కకు పావు కిలో బంగారం

కర్ణాటకలో ఓ పెంపుడు శునకానికి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు యజమానులు. బర్త్​డే గిఫ్ట్​గా ఏకంగా 250 గ్రాముల బంగారాన్నిచ్చి దానిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అమెరికాను వణికించాడు

అమెరికా చరిత్రలోనే అత్యధిక సీరియల్ హత్యలు చేసిన శ్యాముల్​ లిటిల్(80) కాలిఫోర్నియాలో మరణించాడు. జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న శ్యాముల్​.. అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆసుపత్రిలో చేరాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పెరిగిన బంగారం ధర

బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.235 పెరిగింది. కిలోకు వెండి ధర రూ. 273 ఎగబాకింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ప్రాక్టీస్ షురూ

బుధవారం టీమ్​ఇండియాతో కలిసిన ఓపెనర్​ రోహిత్​ శర్మ.. గురువారం మెల్​బోర్న్​లో తన సహచరులతో కలిసి ప్రాక్టీసును మొదలుపెట్టాడు. హిట్​మ్యాన్​ ప్రాక్టీసు చేస్తోన్న ఫొటోలను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అర్ధరాత్రి అప్​డేట్

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త. ఎట్టకేలకు అప్​డేట్ ఇచ్చేందుకు సిద్ధమైంది 'వకీల్​సాబ్' చిత్రబృందం. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్​డేట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details