తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2020, 2:58 PM IST

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS FOR 3PM
టాప్​టెన్​ న్యూస్​@3PM

1. 'ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు'

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురి మృతిచెందిన ఘటనపై కలెక్టర్​ నారాయణరెడ్డి స్పందించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

2. సీఐ ఇంట్లో రూ.3 కోట్ల ఆస్తులు

లంచం తీసుకుంటూ పట్టబడ్డ రంగారెడ్డి జిల్లా షాబాద్‌ సీఐ శంకరయ్య ఇంట్లో రూ. 3 కోట్ల విలువైన ఆస్తులను అనిశా అధికారులకు గుర్తించారు. ఎల్బీనగర్‌లోని అతని నివాసంలో పలు ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

3. తల్లీకూతుళ్లతో పురుగుల మందు తాగించిన 'ఫోన్'

హైదరాబాద్​ అంబర్​పేట పోలీస్​స్టేషన్​ పరిధిలో చరవాణి విషయమై గొడవ పడ్డ తల్లీకూతుళ్లు ఆవేశంలో ఒకరి తర్వాత మరొకరు పురుగు మందు తాగారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

4. ఏపీలో కొత్తగా 1608 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1608 కేసులు నమోదయ్యాయి. మరో 15 మంది వైరస్‌ బారిన పడి మృతిచెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

5. 'ఐకమత్యం, ధైర్యంతోనే వైరస్​పై విజయం'

కరోనా వేళ ప్రజలు ధైర్యం కోల్పోకూడదన్నారు ప్రధాని మోదీ. ప్రజలంతా ఐక్యంగా వైరస్​ను ఎదుర్కోవాలని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వాలు వైరస్​ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

6. భీకర వర్షాలు, పిడుగులకు 12 మంది బలి

ఉత్తరాదిన వర్షాలు ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఝార్ఖండ్​లో పిడుగులకు 12 మంది బలయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

7. 'సౌర విద్యుత్​కు భారత్ అతిపెద్ద మార్కెట్'

సౌర విద్యుత్​కు భారత్​ అత్యంత ఆకర్షణీయ మార్కెట్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మధ్యప్రదేశ్​లోని రేవాలో ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్​ పార్క్​ను ప్రారంభించిన ఆయన కచ్చితమైన, శుద్ధమైన, ప్రమాదరహిత సౌరవిద్యుత్​ను భారత్ ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8. కరోనా కాలంలో పసిడిపై పెట్టుబడులు కలిసొస్తాయా?

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా సంక్షోభం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఉత్తమ సాధనాలు ఏవి? రికార్డు స్థాయిలో ధర పెరిగిన బంగారంపై పెట్టుబడి ఇప్పుడు ఎంత వరకు ఉత్తమం? పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

9. బర్త్​డే గిఫ్ట్​గా 35మంది పిల్లలకు అండగా గావస్కర్

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ సునీల్ గావస్కర్​ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 35 మంది పిల్లలకు శస్త్ర చికిత్స చేయించాలని సన్నీ నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10. ఆ జిల్లాలో చారిత్రక జంక్షన్​కు సుశాంత్​ పేరు

యువ కథానాయకుడు సుశాంత్​ స్వస్థలమైన, బిహార్​ పూర్నియాలోని ప్రఖ్యాత ఫోర్డ్​ కంపెనీ జంక్షన్​కు అతడి​ పేరు పెట్టారు. ఈ మేరకు జిల్లా మేయర్​ సవితా దేవి స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details