తెలంగాణ

telangana

By

Published : Jul 9, 2020, 3:00 PM IST

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్​@3PM​

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 3pm
టాప్​టెన్ న్యూస్​@3PM​

నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా!

జహీరాబాద్‌ నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు జరగాల్సిన బహిరంగ విచారణ వాయిదా వేయాలని చెప్పింది.మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.


నిమ్స్​లో వైద్య సిబ్బంది ఆందోళన... నిలిచిన ఓపీ సేవలు

నిమ్స్​లో వైద్య సిబ్బంది ఆందోళన చేయడంతో పలు విభాగాల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 4 గంటల నుంచి నిరీక్షించగా... మధ్యాహ్నం 12 గంటలకు వైద్యులు విధులకు వచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

నూటికి 70శాతం మందికి కరోనా

ప్రతిపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ మండిపడ్డారు. సీఎం కేసీఆర్​ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సచివాలయం పరిసరాల్లో ఆంక్షలు..

సచివాలయం కూల్చివేత పనులు మూడో రోజూ కొనసాగుతున్నాయి. సెక్రటేరియేట్​ పరిసరాల్లో రహదారులు మూసివేయడం ఫలితంగా రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 1,555 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరాయి. తాజాగా 13 మంది మృతి చెందగా... మెుత్తం మృతుల సంఖ్య 277కు చేరింది. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణలో కీలకంగా భారత్'

బ్రిటన్​ వేదికగా నిర్వహిస్తున్న 'ఇండియా గ్లోబల్​ వీక్​​-2020'లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో భారత్​ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సరిహద్దుల్లో కీలక వంతెనలను ప్రారంభించిన రాజ్​నాథ్​

జమ్ముకశ్మీర్​​లో సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్​ఓ) నిర్మించిన కీలక వంతెనలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఆన్​లైన్​ ద్వారా ప్రారంభించారు. ఎంతో సమర్థంగా వంతెన నిర్మాణాలను పూర్తి చేసిన బీఆర్​ఓను అభినందించారు రాజ్​నాథ్​. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

2021 ప్రథమార్ధానికి కరోనా వ్యాక్సిన్​ సిద్ధం!

ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌచీ అంచనా వేశారు. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'దేశవాళీ టోర్నీలు ప్రారంభమయ్యేది అప్పుడే'

దేశంలో కరోనా తగ్గి సురక్షిత ప్రయాణాలు ప్రారంభమయ్యే వరకు దేశవాళీ క్రికెట్​ జరగదని స్పష్టం చేశారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. యువ ఆటగాళ్ల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

నదిలో విహారానికి వెళ్లి తప్పిపోయిన నటి

కాలిఫోర్నియాలోని నదిలో విహారానికి వెళ్లిన నటి నయా రివెరా.. బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె కోసం అధికారులు గాలిస్తూనే ఉన్నారు.మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details