తెలంగాణ

telangana

By

Published : Jul 6, 2020, 8:58 AM IST

Updated : Jul 6, 2020, 9:11 AM IST

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్​ @ 9AM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOP TEN NEWS@9AM
టాప్​టెన్ న్యూస్​@9AM

'హస్తం' పోరుబాట

విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు చేపట్టనుంది. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, ఎంఎస్​ఎంఈలకు లాక్‌డౌన్ సమయంలో వచ్చిన మొత్తం విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

సగం సర్కారుకే!

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని కొవిడ్‌ పడకల్లో సగం రాష్ట్రప్రభుత్వం తన పర్యవేక్షణలోకి తీసుకోనుంది. వాటి కేటాయింపులో పారదర్శకత కోసం ఒక యాప్‌ తీసుకురానుంది. తద్వారా ఏ ఆసుపత్రిలో ఎన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో తెలిసిపోతుంది. రాష్ట్రంలో కార్పొరేట్‌ ఆసుపత్రుల నియంత్రణను ఐఏస్‌ అధికారుల కమిటీ నిరంతరం పర్యవేక్షించనుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవాళ, రేపు వర్షాలు

రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

బస్తీ వైద్యం

హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలను బల్దియా మ‌రింతగా విస్తరిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 167 బ‌స్తీ ఆసుత్రులు ఉండ‌గా.... కొత్తగా 33 ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వ‌స‌తి, ఇత‌ర మౌలిక సదుపాయాలు క‌ల్పించిన‌ట్లు బల్దియా ప్రకటించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

శ్రావణం.. శుభకరం

దేశవ్యాప్తంగా శివాలయాల్లో శ్రావణ మాస ప్రత్యేక పూజలు జరిగాయి. ఉత్తర్​ప్రదేశ్ వారణాసి, గోరఖ్​పుర్, దిల్లీ, మధ్యప్రదేశ్​లోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ భక్తులు పూజాధికాలు నిర్వహించారు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

నాయకత్వ మార్పిడి

మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌, కర్ణాటకలో యడియూరప్ప, రాజస్థాన్‌లో వసుంధర రాజె, ఝార్ఖండ్‌లో రఘువర్‌దాస్‌.. భాజపాలో ఇలాంటి కొందరు బలమైన ప్రాంతీయ నేతల ప్రాధాన్యం పార్టీ తగ్గించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. వీరికి దీటుగా ఉప ప్రాంతీయ నేతలకు ప్రాధాన్యం దక్కుతోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

చైనాలో మరో మహమ్మరి

చైనాలో ఉద్భవించిన కరోనా ఇప్పటికే ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. కాగా చైనాలోనే మరో భయంకరమైన వైరస్​ ఉనికి బయటపడింది. మంగోలియా ప్రాంతంలోని బయన్నూర్‌లో తాజాగా రెండు బుబోనిక్‌ ప్లేగు కేసులు బయటపడ్డాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

టారిఫ్​ల పెంపు అనివార్యం

ప్రస్తుత విధానంతో ఆపరేటర్లకు సరిపడా లాభాలు రావడం లేదని.. అందువల్ల టెలికాం రంగంలో టారిఫ్​ల పెంపు తప్పదని ఈవై అభిప్రాయపడింది. ఇది ఇప్పటికిప్పుడు సాధ్యపడకపోయినా.. వచ్చే 12-18 నెలల్లో అనివార్యమని వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

బ్యాట్ పడితే బాక్సర్!

డేవిడ్​ వార్నర్​ జట్టులో ఉంటే దిగ్గజ బాక్సర్​ మేవెదర్​ ఉన్నట్లేనని ఆస్టేలియా క్రికెట్​ కోచ్​ జస్టిన్​ లాంగర్​ అన్నారు. గతంలో బాల్​ ట్యాంపరింగ్ విషయంలో వార్నర్​పై నిషేధం విధించడంపైనా స్పందించారు కోచ్​ లాంగర్​. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

బాలీవుడ్​ దర్శకుడితో ప్రభాస్​

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్​ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా, ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడితో తన తర్వాత సినిమా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Last Updated : Jul 6, 2020, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details