తెలంగాణ

telangana

నేటి అర్ధరాత్రి నుంచి టోల్​ రుసుం వసూలు

By

Published : Apr 20, 2020, 7:34 AM IST

టోల్​ప్లాజా వద్ద ఈరోజు అర్ధరాత్రి నుంచి టోల్ రుసుం వసూలు చేస్తున్నట్లు ఎన్​హెచ్​ఏ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. లాక్​డౌన్ కారణంగా టోల్ మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

నేటి అర్ధరాత్రి నుంచి టోల్​ రుసుం వసూలు
నేటి అర్ధరాత్రి నుంచి టోల్​ రుసుం వసూలు

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించడం వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే ఫీజుకు మినహాయింపు ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 18 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈరోజు అర్ధరాత్రి నుంచి టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఎన్. హెచ్.ఏ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. టోల్ ప్లాజాల ఫీజును స్వల్పంగా పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details