పల్లె పోరులో భాగంగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల సన్నద్ధత, నిర్వహణపై కలెక్టర్లు, అధికారులతో.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ సమీక్షించారు. ఏర్పాట్లు పక్కాగా చేశారని ప్రశంసించారు. ఇదే సమయంలో ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం వ్యతిరేకం అన్నట్లుగా ప్రచారం జరుగుతుందన్న ఆయన... అది అవాస్తవమని తేల్చిచెప్పారు. పోటీ ఎక్కువగా ఉండి, ప్రజలందరూ ఎన్నికల్లో భాగస్వామ్యులవ్వాలని... అందుకు ఏకగ్రీవాలు అడ్డుకాకూడదనే చెప్పానని స్పష్టంచేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.
నేడు నిఘా యాప్ ఆవిష్కరణ..
ఎన్నికల తీరును పరిశీలించేందుకు రూపొందించిన ప్రత్యేక నిఘా యాప్ను.. ఇవాళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఆవిష్కరించనున్నారు. ఈ యాప్ ద్వారా ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఇతరత్రా సమస్యలు నేరుగా ఎస్ఈసీకి తెలియజేసే అవకాశం ఉంది.
ప్రత్యేక పరిశీలకుడిగా మాజీ ఎస్ఈసీ