తెలంగాణ

telangana

'ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని మాకు ముందే తెలుసు'

By

Published : Mar 18, 2021, 9:48 AM IST

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా.. సీఎం కేసీఆర్​ పీఆర్సీపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. రెండు, మూడు రోజుల్లో పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామన్న ఈ ప్రకటనపై ఉద్యోగులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.

tngo thanks to state govt on prc announcement
'ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని మాకు ముందే తెలుసు'

అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ చేసిన పీఆర్​సీ ప్రకటనపై టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఏ రాష్ట్రంలో లేనట్టుగా.. మెరుగైన ఫిట్మెంట్​ను ప్రకటిస్తామని తెలియజేయడం ఉద్యోగులందరినీ సంతోషంలో ముంచెత్తిందన్నారు రాజేందర్‌. తెరాసది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని తమకు ముందే తెలుసన్నారు.

ఇదీ చదవండి:సర్కారుపై లక్ష కోట్ల భారం అయినా పీఆర్​సీ ఇస్తాం: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details