తెలంగాణ

telangana

ETV Bharat / state

కష్టకాలంలో ఆకలి తీరుస్తున్న టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు - తెలంగాణ తాజా వార్తలు

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు తనవంతు సాయంగా నిత్యావసర సరకులు, భోజనం అందిస్తున్నారు హైదరాబాద్​ జిల్లా టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు ముజీబ్​ హుస్సేన్​. పాతబస్తీ బురుజులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో 200 మందికి ఆహారం ప్యాకెట్లు అందించారు.

Telangana news
తెలంగాణ వార్తలు

By

Published : May 19, 2021, 1:57 PM IST

లాక్​డౌన్​ సమయంలో నిత్యం నగరంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు, వారి సహాయకులకు ఆహారం అందిస్తున్నారు హైదరాబాద్ జిల్లా తెలంగాణ టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ. పేదలకు అవసరమైన నిత్యావసర వస్తువులు, భోజనం అందిస్తూ కష్టకాలంలో అండగా ఉంటున్నారు.

బుధవారం పాతబస్తీ బురుజులోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో 200 మందికి ఆహార ఫ్యాకెట్లు అందించారు. కొవిడ్​ మొదటి దశలోనూ టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 56 రోజుల పాటు నిత్యావసర సరుకులు, ఆహార ప్యాకెట్లు, మెడికల్ కిట్లను అందజేశామని ముజీబ్ తెలిపారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్​తో ఉపాధి కరవాయె.. పిల్లలకు పట్టెడన్నం వరమాయె.!

ABOUT THE AUTHOR

...view details