ఫిబ్రవరి మూడో వారంలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. అన్ని వర్గాలు అందుకు సహకరించి మద్దతు ఇవ్వాలని కోరారు. దిల్లీలో చలిలో ఆందోళన చేస్తున్న రైతుల స్ఫూర్తితో ఉద్యమం చేస్తామన్నారు.
నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో 'బతుకుదెరువు నిలబెట్టాలి- తెలంగాణను కాపాడాలి' నినాదంతో చేపట్టిన 48 గంటల దీక్షను కోదండరాం విరమించారు. నిరుద్యోగులు, రైతులు, ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకుదెరువు నిలబెట్టాలి డిమాండ్ల చేశారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు.