తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యవ్యవస్థపై కేంద్ర పెత్తనం తగదు: కోదండరాం

కేంద్రం ప్రవేశపట్టిన ఎన్​ఎమ్​సీ బిల్లుకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇవాళ ఇందిరా పార్కు వద్ద జరిగిన జూడాల సమ్మెకు తెజస సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ ధర్నాకు ఆచార్య కోదండరాం హాజరై మాట్లాడారు.

By

Published : Aug 8, 2019, 4:43 PM IST

వైద్యవ్యవస్థపై కేంద్ర పెత్తనం తగదు: కోదండరాం

దిల్లీలో ఎవరో కూర్చుని ఇక్కడ వైద్య వ్యవస్థను నియంత్రించడం సరికాదని తెజస అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద ఆందోళన చేస్తున్న జూడాలకు తెజస సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గతంలో ఎన్‌ఎంసీ బిల్లు చట్టం కాకుండా అడ్డుకున్నామని చెప్పారు. ఇప్పుడు దాన్ని మార్చే వరకు ఊరుకోబోమని స్పష్టంచేశారు. వైద్య విధానం రాష్ట్రం పరిధి నుంచి కేంద్రం పరిధిలోకి తీసుకునేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నారని వివరించారు.

వైద్యవ్యవస్థపై కేంద్ర పెత్తనం తగదు: కోదండరాం

ABOUT THE AUTHOR

...view details