తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికులకు సీసీఎస్​ డబ్బులను చెల్లించాలి' - ఛలో బస్​భవన్

ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం సీసీఎస్ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నట్లు జాతీయ మజ్దూర్ యూనియన్ తెలిపింది. ఈ నెల 15న ఛలో బస్​భవన్​ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి జె.హనుమంతు తెలిపారు.

tjmu demands RTC owners have to pay CCS money to workers
'ఆర్టీసీ కార్మికులకు సీసీఎస్​ డబ్బులను చెల్లించాలి'

By

Published : Oct 6, 2020, 6:44 PM IST

కార్మికులు దాచుకున్న సీసీఎస్ డబ్బులను ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న ఛలో బస్​భవన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జె.హనుమంతు ముదిరాజ్ తెలిపారు. హైదరాబాద్ విద్యానగర్​లోని యూనియన్ కార్యాలయంలో రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. కార్మికులు సీసీఎస్​లో దాచుకున్న 920 కోట్ల రూపాయలను ఆర్టీసీ యాజమాన్యం నేటికీ ఇవ్వకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్ డబ్బులను గత రెండేళ్లుగా వాడుకుంటూ కార్మికులు కష్టకాలంలో ఆ డబ్బును వినియోగించుకోకుండా ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

సమ్మె సమయంలో అసువులు బాసిన కార్మికులను ఆదుకోవడానికి నాటి టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డికి ఎన్నారై దాతలు ఇచ్చిన విరాళాలను నేటికీ బాధితులకు అందచేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. టీఎంయూ నేతలు కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి తమ సొంత ప్రయోజనాల కోసం బయటకు రావడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. కార్మికుల సంక్షేమం కోసం పాటుపడని నాయకుల పట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఇవీ చూడండి: ప్రభుత్వరంగ సంస్థల బకాయిలే రూ.200కోట్లు

ABOUT THE AUTHOR

...view details