తార్నాకలోని పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కొవిడ్ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాక్సు బాక్సుకి మధ్య దూరం ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఓటు వేయడం అందరి నైతిక బాధ్యత: కోదండరాం - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్
తార్నాకలో గ్రేటర్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రంలో టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం, ఆయన సతీమణి ఓటు వేశారు.

ఓటు వేయడం అందరి నైతిక బాధ్యత: కోదండరాం
పోలింగ్లో భాగంగా టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఆయన సతీమణి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం నైతిక బాధ్యత అని కోదండరాం అన్నారు. ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు ఉండదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ రాంచందర్రావు
Last Updated : Dec 1, 2020, 10:33 AM IST