తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2022, 3:34 PM IST

ETV Bharat / state

Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​.. దర్శన టికెట్ల సంఖ్య పెంపు

Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీ నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో వెల్లడించింది.

TTD
TTD

Tirumala : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు(బుధవారం) విడుదల చేయనున్నట్లు తితిదే వెల్లడించింది. ఈ నెల 24 నుంచి అదనపు కోటా కింద 13వేల దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

అలాగే మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 25వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపు ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మార్చి నెలకు సంబంధించి సర్వదర్శన టికెట్లను రోజుకు 20 వేలకు పెంచిన తితిదే.. నిత్యం 5 వేల చొప్పున అదనపు కోటా కింద జారీ చేయనున్నారు. తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్లు తితిదే వెల్లడించింది.

ఇదీ చూడండి :భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు తేదీలు ఖరారు.. ఈసారి భక్తుల మధ్యే రాములోరి కల్యాణం

ABOUT THE AUTHOR

...view details