ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన వేతనసవరణ, పదవీవిరమణ వయసు పొడిగింపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఉద్యోగుల వేతనసవరణపై త్రిసభ్య కమిటీ భేటీ - ఉద్యోగుల వేతన సవరణపై సీఎస్ అధ్యక్షతన సమావేశం
వేతనసవరణ, ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశమైంది. సీఎం ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
![ఉద్యోగుల వేతనసవరణపై త్రిసభ్య కమిటీ భేటీ Three members committee meeting on pay revision of employees in the state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10376842-461-10376842-1611582148176.jpg)
ఉద్యోగుల వేతనసవరణపై త్రిసభ్య కమిటీ భేటీ
వేతనసవరణ సంఘం ఇచ్చిన నివేదిక, ఉద్యోగ సంఘాలతో చర్చలు, ఇతర అంశాలపై ప్రధాన చర్చ జరిగింది. ఉద్యోగ సంఘాలతో చర్చలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా కమిటీ రూపొందించింది. ఈ సమావేశంలో ఆర్థిక, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ పాల్గొన్నారు.